మైదుకూరు: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రవీంద్రారెడ్డి ఈనెల 7న జిల్లాకు వస్తున్నట్లు కలెక్టర్ అనిల్కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి 6న ఉందానగర్ నుంచి రైలులో బయలుదేరి 7న కమలాపురం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఖాజీపేట చేరుకుంటారు. 7 గంటలకు ఖాజీపేట నుండి రోడ్డు మార్గాన బయలుదేరి 7.30కు కడపలో స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని రాత్రి ఖాజీపేటలో బస చేస్తారన్నారు.
8న ఉదయం 10 గంటలకు మైదుకూరు తహసీల్దార్ కార్యాలయంలో జరిగే సమావేశంలో పాల్గొని రాత్రి ఖాజీపేటలో బస చేస్తారన్నారు. 9న ఖాజీపేటలో స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 10న ఎర్రగుంట్ల మండలం నిడిజివ్వ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఖాజీపేట చేరుకుని రాత్రి 9.30కు కమలాపురం నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఉందానగర్ వెళ్తారని తెలిపారు.
నేడు మంత్రి డీ ఎల్ రవీంద్రారెడ్డి జిల్లాకు రాక
March 6th, 2012
ఎడిటర్
RSS Feed
Twitter


Posted in 
