శెట్టివారిపల్లెలో ఘనంగా మాతృభాషా దినోత్సవం

మైదుకూరు: తెలుగు భాష పరిరక్షణలో ప్రతిఒక్కరూ తమ వంతు కృషి సలపాలని తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి తవ్వా ఓబుల్ రెడ్డి పిలుపిచ్చారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప జిల్లా మైదుకూరు మండలం శెట్టివారిపల్లెలో శనివారం(21-02-2013) మాతృభాషా దినోత్సవం ఘనంగా జరిగింది.  తాత్కాలిక ప్రధానోపాధ్యాయుడు కె.ఓబులేశు అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తవ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ  ప్రపంచంలో వివిధ భాషలు అంతరించిపోతున్న తీరును వివరించారు. తెలుగు భాష విస్తృతినీ, గొప్పతనాన్ని గురించి విద్యార్థులకు తెలిపారు. తెలుగుభాషొద్యమ సమాఖ్య కెంద్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్ బాబు నాయకత్వంలో తెలుగు భాష పరిరక్షణకు గత పదేళ్ళుగా జరుగుతున్న ఉద్యమం గురించీ, అందులో “నడుస్తున్న చరిత్ర”  పత్రిక నిర్వహిస్తున్న భూమికను గురించి ఆయన వివరించారు. ఈ సందర్భంగ్గా నిర్వహించిన పద్యపఠన, వకృత్వ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినీవిద్యార్థులకు బహుమతులను అందచేశారు. తమ మాతృభాష అయిన తెలుగు భాషను పరిరక్షించుకుంటామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈకార్యక్రమంలో వేమన సాహితీ పీఠం అధ్యక్షుడు కర్నాటి రాజశేఖర్ రెడ్డ్డి, ఉపాధ్యాయులు రమణారెడ్డి, వెంకటరామిరెడ్డి, రవికుమార్, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు   .

Share

ఈనాడు ప్రతిభ పాటవ పోటీలకు విశేష స్పందన

మైదుకూరు: బాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనాడు-హాయ్ బుజ్జి  మైదుకూరులో నిర్వహించిన ఈనాడు ప్రతిభ పాటవ పోటీలకు విశేష స్పందన  లభించింది. స్థానిక మేధా జూనియర్ కళాశాలలో ఈ పోటీలలో భాగంగా నిర్వహించిన చిత్రలేఖనం ,పరిజ్ఞాన పోటీలలో అధిక సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈపోటీలకు న్యాయనిర్ణేతలుగా కథా రచయిత,

Share

పేద ప్రజల గొంతుక , ప్రజాఉద్యమాల సారధి ‘ఎంజే’ కన్నుమూత

మైదుకూరు : పేద ప్రజల గొంతుక  తానై నిరుపేదల కార్మికుల, మహిళల హక్కులకోసం అవిశ్రాంత పోరాటం చేసిన రాయలసీమ పౌరహక్కుల సంఘం కన్వీనర్ ఎంజే సుబ్బరామిరెడ్డి(60) గురువారం కన్నుమూశారు. నమ్మిన సిద్ధాంతాల కోసం బతికిన ఎంజే మరణించాడన్న వార్త అయన సన్నిహితులకే కాక, రైతులు, పేద ప్రజలందరినీ కలతకు గురిచేసింది. రెండు వారాల కిందట తిరుపతిలో జరిగిన రైలు ప్రమాదంలో   గాయపడిన ఎంజే స్విమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన  1953 జూలైన 1న ఖాజీపేట మండలం బి.తిప్పాయపల్లె గ్రామంలో ములపాకు పెద్ద సుబ్బా రెడ్డి ,ఓబులమ్మ దంపతులకు మూడవ కుమారుడు గా జన్మించారు. విద్యార్థిదశలోనే ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. కమ్యూనిస్టు యోధులు ఎద్దుల ఈశ్వరరెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, కమ్మూ సోదరుల ప్రభావంతో వామపక్ష భావాలకు ఆకర్షితుడై ప్రజా ఉద్యమాలను నిర్మించారు.

Share

బుద్ధుని పాదముద్రికలు స్వాధీనం : మ్యూజియానికి తరలింపు

ఖాజీపేట: ఖాజీపేట మండలం పుల్లూరు, ఆంజనేయకొట్టాలు గ్రామ పరిధిలోని చెరువు వద్ద వెలుగు చూసిన బుద్ధుని పాదముద్రికలను సోమవారం (18.06.2012) పురావస్తుశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడపలోని శ్రీభగవాన్‌ మహావీర్‌ ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాలకు తరలించారు. పురావస్తుశాఖ కడప, చిత్తూరు జిల్లాల అసిస్టెంటు డైరెక్టర్‌ రమణ ఆంజనేయకొట్టాలు గ్రామానికి తన సిబ్బందితో తరలివచ్చి గ్రామ పరిసరాల్లోని బుద్ధుని

Share

కవి చౌడప్ప పుల్లూరు వాసే: బయలుపడ్డ బుద్ధుని పాదముద్రికలు!!

ఖాజీపేట: కడప జిల్లా ఖాజీపేట మండలపరిధిలోని పుల్లూరు చెరువులో, గ్రామ పరిసరాల్లో బుద్ధుడి పాదముద్రికలతో కూడిన శిలావిగ్రహాలు బయటపడ్డాయి. తెలుగు సామాజిక సాంస్కృతిక సాహిత్యాభివృద్ధి సంస్థ గౌరవాధ్యక్షుడు తవ్వా ఓబుల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ధర్మిశెట్టి రమణ శనివారం ఈ శిలావిగ్రహాలను పరిశీలించి విలేకర్లకు వెల్లడించారు. క్రీస్తు పూర్వం 5, 6 శతాబ్దాలలో జీవించిన బుద్ధ భగవానునికి సంబంధించిన అవశేషాలు, కీస్తుశకం

Share

నిర్మొహమాట హాస్యకవి.. మన పుల్లూరు “కవి చౌడప్ప”

“కవి చౌడప్ప”గా ప్రసిద్ధి చెందిన “కుందవరపు చౌడప్ప” నియోగి బ్రాహ్మణుడు. ఈయన కడప జిల్లాలోని ఖాజీపేట మండలంలోని  పుల్లూరు  ( ప్రస్తుత ఆంజనేయకొట్టాలు )  గ్రామవాసి . మట్లి అనంత భూపాలుని చేతనూ, తంజావూరు రఘునాధ రాయల చేత సన్మానించబడటం చేత ఈతను బహుశా 1580-1640 మధ్య కాలం వాడై ఉండవచ్చును. ఈయన “కవి చౌడప్ప” మకుటంతో ఒక శతకాన్ని రచించాడు. ఈ పద్యాలలో నీతి, శృంగారంతో పాటు బూతులు

Share

గోవింద నామస్మరణతో మారుమోగుతున్న బ్రహ్మంగారిమఠం

బ్రహ్మంగారిమఠం: కలియుగ కాలజ్ఞాని జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహేంద్రస్వాముల వారి ఆరాధన గురుపూజ మహోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సోమవారం ఉదయం శ్రీవీర బ్రహ్మ సుప్రభాతం, నామసంకీర్తనం, అభిషేకంతో పాటు స్వామి వారి ఉత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా వేలాది మంది భక్తుల మద్య వీనుల విందుగా స్వామి వారి ఉత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవాలకు తరలి వస్తున్న భక్తాదులు

Share

పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవంగా రథోత్సవాలు

పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీవైద్యనాథ స్వామి, శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామివార్ల రథోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. మొదట శ్రీ వైద్యనాథ స్వామి రథోత్సవం నిర్వహించారు. శ్రీ కామాక్షీ సమేతుడైన వైద్యనాథ స్వామి రథంపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. ఆ సందర్భంగా భక్తులు శివ నామాన్ని స్మరిస్తూ పోటీలు పడి రథాన్ని లాగారు. కాయ కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి

Share

సామాజిక రుగ్మతల నిర్మూలనకు కలాలే అస్త్రాలు కావాలి-తెభాస

మైదుకూరు : సమాజంలో చోటు చేసుకుంటున్న సాంస్కృతిక విధ్వంసాలు, సామాజిక రుగ్మతలపై కలాలను అస్త్రాలుగా ప్రయోగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కవులు, కవయిత్రులు, రచయితలు పేర్కొన్నారు. ఉగాది సంద ర్భంగా తెలుగుభాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వ హించిన రచనల పోటీల్లో విజేతలకు ఆదివారం స్థానిక జెడ్పీ హైస్కూల్లో బహుమతులు ప్రదా నం చేశారు. కథా రచయిత

Share

తెలుగు భాషోద్యమ సమాఖ్య ఉగాది రచనల పోటీ ఫలితాలు!

 

శ్రీ నందన నామ ఉగాది పండుగ సందర్భంగా తెలుగు భాషోద్యమ సమాఖ్య  మైదుకూరు శాఖ నిర్వహించించిన రచనల పోటీలో విజేతల వివరాలను గురువారం ప్రకటించారు.  ఈ నెల 25 వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్తానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. తెలుగు భాషాభిమానులనూ,

Share
Designed by Tavva Communications | Honorary Editor: Obula Reddy | Thanks to Kadapa.info, Chennapatnam.com and Vaidyam