డి.ఎల్. విజయం

D.L.Ravindra Reddy

D.L.Ravindra Reddy

మైదుకూరు: మైదుకూరు శాసనసభకు జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి  డి.ఎల్.రవీంద్రారెడ్డి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి ఎస్.రఘురామిరెడ్డిపై 4361 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఖాజీపేట మండలం సుంకేశుల గ్రామానికి చెందిన ఈ వైద్య పట్టభద్రుడు ఆరవసారి శాసనసభకు ఎన్నికయ్యారు. డి.ఎల్. గెలుపు నేపధ్యంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరపుకున్నారు. మైదుకూరు శాసనసభ నియోజకవర్గంలో వివిధ పార్టీల అభ్యర్థులకు నమోదైన ఓట్లు క్రింది విధంగా ఉన్నాయి.

 

 

 

కాంగ్రెస్ - డి.ఎల్.రవీంద్రారెడ్డి – 62377

తెలుగుదేశం - ఎస్.రఘురామిరెడ్డి – 58016

ప్రజారాజ్యం – ఇ.తిరుపాలరెడ్డి – 16552

భా.జ.పా - ఇ.ప్రభాకరరెడ్డి - 754

బిసి యునైటెడ్ ఫ్రంట్ – జి.తిరుపతి - 448

  • Share/Save/Bookmark

Comments

కుమ్మరికొట్టాలు హత్యల కేసులో నరహంతక ముఠా అరెస్ట్

Serial Killers with Police

పోలీసులతో నరహంతక ముఠా

కడప, మే 14 (కడప డాట్ ఇన్ ఫో న్యూస్): ఈ నెల 6 వ తేదీ రాత్రి కడప జిల్లా ఖాజీపేట మండలం కుమ్మరకొట్టాలు సమీపం లోని దాసరి కొట్టాలు వద్ద తంగా నారాయణ, తంగా రమణమ్మ , రాణెమ్మ అనే ముగ్గురిని దారుణంగా హత్య చేసి దోపిడీకి పాల్పడిన నరహంతక ముఠా ను పొలీసులు అరెస్ట్ చేసారు. యాటగిరి సుబ్రమణ్యం, చిన్న రవి, తుపాకుల శివయ్య, పోలయ్య, పెంచలయ్య అనే ఐదుగురిని గురువారం మైదుకూరు పోలీసులు విలేకరుల ఎదుట హాజరు పరిచారు. వీరంతా చిత్తూరు జిల్లా చౌడవరం, కడప జిల్లా బాలిరెడ్డి పల్లె, నెల్లూరు జిల్లా అత్తివరం గ్రామాలకు చెందిన వారు. శ్రీకాళహస్తి, బద్వేలు, కోడూరు ప్రాంతాలలో దోపిడీలకు, హత్యలకూ, అత్యాచారాలకూ పాల్పడ్డారు. కడప జిల్లా కలసపాడు సమీపం లోని ముదిరెడ్డి పల్లె పొలాల్లో కాపలాదారులుగా చెలామణీ అవుతూ నేరాలకు పాల్పడుతున్నారు.
కడప జిల్లా తో పాటు చిత్తూరు , నెల్లూరు జిల్లాలలో దాదాపు 15 హత్యలూ, అనేక అత్యాచారాలతో ఈ ముఠా కు సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు.

  • Share/Save/Bookmark

Comments

మైదుకూరు - రాయలసీమలోని ఒక ప్రముఖ కూడలి కేంద్రం - అభివృద్ధీ, ఆధునీకరణలు వేగవంతంగా చోటు చేసుకుంటున్న కడప జిల్లాలోని ఒక నియోజకవర్గం.  మైదుకూరు,ఖాజీపేట, దువ్వూరు, బ్రహ్మంగారిమఠం, చాపాడు మండలాలు ఈ నియోజకవర్గంలో అంతర్భాగాలు.

తెలుగు గంగ, కె.సి.కెనాల్ పంట కాలువలూ, చెరువులూ, దొరవులూ, వాగులూ, వంకలూ, పచ్చటి పైర్లూ, నల్లమల అడవులూ, ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన సొగసును చేకూరుస్తుంటాయి. ఈ ప్రాంత విలక్షణ జీవవైవిధ్యానికి కె.పి.ఉల్లి ,ఎర్రచందనం నిదర్శనాలు. శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం, ఈ అభయారణ్యాన్ని ఆవాసంగా చేసుకున్న కలివికోడి - మైదుకూరు నియోజకవర్గానికి ప్రత్యేకతను సంతరించిపెడుతున్నాయి. పెన్న, కుందూ నదుల హొయలు మైదుకూరు ప్రాంత నైసర్గిక శోభను ఇనుమడింపచేస్తున్నాయి.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన పుష్పగిరి, బ్రహ్మంగారిమఠంలతో పాటు అల్లాడుపల్లె వీరభద్ర స్వామి ఆలయం,  నాగనాధేశ్వరకొండ, ముక్కొండ మల్లేశ్వర దేవస్థానం, భైరవకోన, మైదుకూరులోని మాధవరాయ స్వామి దేవస్థానం, అంకాలమ్మ గుడి, సాయిబాబా గుడి, వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిశాల, శ్రీ ముడుమాల సిద్దయ్య,  దుంపలగట్టు అంకాలమ్మ దేవస్థానం, యెల్లంపల్లె తిరుమలనాధాలయం, వనిపెంట చెన్నకేశవాలయం, రాష్ట్రంలొ ఎత్తైన మసీదుల్లో ఒకటిగా పేరుగాంచిన మైదుకూరు షాహి మసీదు, క్రైస్తవ క్షేత్రం కరుణగిరిలు  మైదుకూరు నియోజక వర్గంలో ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి.

కాలఙ్ఞాన కర్త వీరబ్రహ్మేంద్ర స్వామి-శిష్యుడు సిద్దయ్య-మనువరాలు ఈశ్వరాంబ, అవధూత నారాయణ స్వామి, పిచ్చమాంబ, లింగాలదిన్నె బ్రహ్మస్వామి, కక్కయ్య స్వామి, పుల్లయ్య స్వామి, కేశాలు Read the rest of this entry »

  • Share/Save/Bookmark

Comments (2)